అక్షరటుడే, వెబ్డెస్క్ : Nambala Keshavarao | మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు (Maoist top leader Nambala Keshavarao) ఇటీవల నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో (encounter) మృతి చెందిన విషయం తెలిసిందే. మావోయిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆయనతో సహా 27 మంది భద్రతా బలగాలతో జరిపిన కాల్పుల్లో మరణించారు. అయితే నంబాల కేశవరావు మృతిపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Nambala Keshavarao | నిఘా వర్గాలకు ముందే తెలుసు
మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ (Maoist Special Zonal Committee) పేరుతో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేశవరావు 6 నెలలుగా మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసని వారు పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆయన టీమ్లోని ఆరుగురు సభ్యులు లొంగిపోయారని తెలిపారు. వారిచ్చిన సమాచారంతోనే కేశవరావును ఎన్కౌంటర్ (Keshavarao encounter) చేశారని ఆరోపించారు.
Nambala Keshavarao | వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు
కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించినట్లు లేఖలో (Letter) మావోయిస్టులు తెలిపారు. అయితే తమను వదిలి బయటకు వెళ్లేందుకు ఆయన ఇష్టపడలేదన్నారు. కేశవరావుని కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలు అడ్డుపెట్టారని చెప్పారు. అయితే ఈ ఎన్కౌంటర్లో (encounter) ఏడుగురు సురక్షితంగా బయటపడ్డట్లు తెలిపారు.
Nambala Keshavarao | కాల్పుల విరమణ ప్రకటించాం
పాకిస్తాన్తో కాల్పుల విరమణకు ఒప్పుకున్న కేంద్ర ప్రభుత్వం (central government) తమతో చర్చలకు ఎందుకు సిద్ధంగా లేదని వారు ప్రశ్నించారు. తాము ఇప్పటికే కాల్పుల విరమణ (ceasefire) ప్రకటించి ఎలాంటి కాల్పులు జరపలేదన్నారు. అయినా బలగాలు తమపై నిత్యం దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు.