అక్షరటుడే, వెబ్డెస్క్:Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR) విచారణ ముగిసింది. కమిషన్ ఛైర్మన్ పీసీఘోష్(PC Ghosh) కేసీఆర్ను ఫేస్ టూ ఫేస్ విచారించారు. మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్ను కమిషన్ బహరంగంగా విచారించింది. కేసీఆర్ను కూడా బహిరంగ విచారణకు పిలిచింది. అనారోగ్య కారణాలతో ఇన్ కెమెరా విచారణ చేపట్టాలని కేసీఆర్ కోరారు. దీంతో పీసీ ఘోస్ కేసీఆర్ను వ్యక్తిగతంగా విచారించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram project) నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపై కమిషన్ కేసీఆర్ను ప్రశ్నించింది. తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్కు మాజీ వివరించినట్లు సమాచారం. 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా పలు డాక్యుమెంట్లు పీసీ ఘోష్ కమిషన్కు అందించారు. కాగా మరికొద్ది సేపట్లో ఆయనకు కమిషన్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.