అక్షరటుడే, వెబ్డెస్క్ : Maganti Gopinath | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మాగంటి గోపినాథ్ (Maganti Gopinath ) భౌతిక కాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆదివారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని మాదాపూర్లోని నివాసానికి తరలించారు.
మాగంటి మృతి విషయం తెలుసుకున్న కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్ (Erravalli Farm House) నుంచి నేరుగా ఆయన ఇంటికి చేరుకున్నారు. గోపినాథ్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన కేసీఆర్ కంటతడి పెట్టారు. అనంతరం మాగంటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, కేటీఆర్ సహా.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఉన్నారు. కాగా.. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.