అక్షరటుడే, వెబ్డెస్క్ : KCR | ఎర్రవెల్లి ఫామ్హౌస్లో Erravalli Farmhouse మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (former CM KCR), మాజీ మంత్రి హరీశ్రావు (Harish rao) భేటీ అయ్యారు. విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్తో హరీశ్రావు భేటీ అయ్యారు.
జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీశ్రావు, జూన్ 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని కమిషన్ నోటీసుల్లో సూచించింది. ఈ క్రమంలో విచారణకు వెళ్లాలా వద్దా? అనే దానిపై కేసీఆర్, హరీశ్రావు చర్చిస్తున్నట్లు సమాచారం. నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని కమిషన్ పేర్కొంది. ఈ క్రమంలో ఎలా స్పందించాలి, విచారణకు వెళ్లాలా వద్ద అనే అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.