More
    HomeతెలంగాణBandi Sanjay | కేసీఆర్​ ఢిల్లీలో మూటలు అప్పజెప్పారు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Bandi Sanjay | కేసీఆర్​ ఢిల్లీలో మూటలు అప్పజెప్పారు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bandi Sanjay | రాష్ట్ర ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్​పై కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram Project)లో కేసీఆర్​ అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రంలో ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ చేశారని తెలిసినా సీఎం రేవంత్​రెడ్డి ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కేబినెట్, సబ్ కమిటీ నివేదికలను ఎందుకు బయటపెట్టడం లేదన్నారు.

    మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీలో కాంగ్రెస్​ పెద్దలకు మూటలు అప్పగించారని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబంపై చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని గతంలో రాహుల్ గాంధీ ఆరోపించారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం విచారణ పేరిట కాలయాపన చేస్తోందని విమర్శించారు.

    READ ALSO  Padi Kaushik Reddy | ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డికి రిమాండ్​

    Bandi Sanjay | సీబీఐకి అప్పగించాలి

    కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐ (CBI)కి అప్పగించాలని ఆయన డిమాండ్​ చేశారు. కేసీఆర్ కుటుంబం (KCR Famuly) అవినీతి మీద విచారణ జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరం వ్యవహారంలో బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబానికి రేవంత్‌ రెడ్డి సర్కారు రక్షణ కవచంగా మారిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని పేర్కొన్నారు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. అందుకే ఆ కేసులను సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్​ చేశారు.

    Bandi Sanjay | జాతీయ హోదా ఇస్తే పరువు పోయేది

    కాళేశ్వరం ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇస్తే పరువు పోయేదని బండి సంజయ్​ అన్నారు. కూలిపోయిన ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఇంకా బీఆర్​ఎస్​ నాయకులు సిగ్గు లేకుండా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత..? ఇప్పుడు పంట దిగుబడి ఎంత అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఆ లెక్కలను బయట పెట్టాలన్నారు. ప్రస్తుతం కాళేశ్వరం లేకపోయిన దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్​ఎస్​ సమాధానం చెప్పాలన్నారు.

    READ ALSO  Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్​కు నోటీసులు ఇవ్వాలి: బండి సంజయ్

    Latest articles

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    More like this

    Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని...

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...