అక్షరటుడే, వెబ్డెస్క్ : Bike taxis | కర్ణాటక ప్రభుత్వం (Karnataka governament) ప్రయాణికులకు పెద్ద షాక్ ఇచ్చింది. నేటి నుండి కర్ణాటకలో బైక్ టాక్సీలు బంద్ (Bike taxis Ban) అయ్యాయి. మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన నియమాలు రూపొందించే వరకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ఈ సేవలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయంతో బెంగళూరు, కర్ణాటకలోని ఇతర నగరాల్లోని లక్షలాది మంది ప్రయాణికులకు జర్నీ సమస్యలు ఎదురుకానున్నాయి. రాపిడో, ఉబర్ మోటో వంటి ఆపరేటర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగలినట్లైంది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి కంపెనీల బైక్ టాక్సీ సేవలు కర్ణాటక రాష్ట్రంలో పూర్తిగా నిలిచిపోతాయి. కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) నియమాలు, మార్గదర్శకాలను నిర్ణయించే వరకు బైక్ టాక్సీలను నడపడం చట్టవిరుద్ధం అని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
Bike taxis | పెద్ద సమస్యే..
బైక్ టాక్సీలపై నిషేధం (Bike Taxis Ban) అమలులోకి రావడంతో బెంగళూరులో లక్షకు పైగా గిగ్ వర్కర్లు(Gig workers) తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. వారంలోనే ఈ నిషేధం ప్రభావం స్పష్టంగా కనిపించడంతో, తమ జీవనాధారంపై దెబ్బ పడిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్ టాక్సీలను చట్టబద్ధంగా గుర్తించాలని, పసుపు నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను రవాణా వాహనాలుగా నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఓలా, ఉబర్ ఇండియా, ర్యాపిడో సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కానీ, ఈ కంపెనీలు మధ్యంతర ఉపశమనం కోసం దాఖలు చేసిన దరఖాస్తును కోర్టు తిరస్కరించింది. స్పష్టమైన నియమాలు లేకుండా బైక్ టాక్సీ సర్వీసులను చట్టబద్ధంగా పరిగణించలేమని జస్టిస్ బి.ఎం. శ్యామ్ ప్రసాద్ ధర్మాసనం స్పష్టం చేసింది.
మోటారు వాహనాల చట్టం కింద బైక్ టాక్సీలకు (bike taxis) మార్గదర్శకాలను రూపొందించడానికి ప్రభుత్వానికి కోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది. బైక్ టాక్సీలు నగరంలో రవాణా వ్యత్యాసాన్ని తగ్గించడంతో పాటు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీంతో పాటు వేలాది మంది యువకులు, గిగ్ వర్కర్లు వీటిలో చాలామంది పార్ట్టైమ్ ఉద్యోగులతో (Par time Job) పాటు పూర్తిస్థాయి రైడర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ నిషేధంతో వారు ఆదాయంలో గణనీయమైన కోతతో ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. రోజుకు సగటున ₹800 – ₹1200 వరకూ సంపాదించేవారు, ఇప్పుడు పూర్తిగా ఆదాయం కోల్పోతున్నారు. జూన్ 15 వరకు బైక్ టాక్సీలు నడపడానికి ఆయా కంపెనీలకు అనుమతిని ఇస్తూ, కోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు, ఆ ఉపశమనం పొడిగించడానికి నిరాకరించింది. అంటే, కర్ణాటకలో ఈ రోజు నుంచి బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోతాయి. స్పష్టమైన లైసెన్సింగ్ లేకపోవడం, ప్రయాణికుల భద్రత సమస్యలు, ట్యాక్సీ యూనియన్ల నుంచి వచ్చిన ఒత్తిడులు ఈ నిర్ణయానికి దారితీశాయని కర్టాటక ప్రభుత్వం అంటుంది.