అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | మండలంలోని ఉగ్రవాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (MLA Katipalli Venkataramana Reddy) హాజరై చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తోందన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.