More
    HomeతెలంగాణKaleshwaram | కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Kaleshwaram | కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించాలి : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐ(CBI)కి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్​చాట్​లో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టే ఈటల రాజేందర్​ విచారణకు హాజరయ్యారన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్‌ విచారణకు హాజరు కావాలని సవాల్​ విసిరారు.

    Kaleshwaram | బనకచర్ల మీద నిర్ణయం తీసుకోలేదు

    ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్​ (Banakacharla Project) మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్​రెడ్డి తెలిపారు. వారం క్రితం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్రం ఇంకా దానిని పరిశీలించలేదని చెప్పారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని ఆయన అన్నారు. అయితే బనకచర్లను ఎందుకు నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ ప్రాజెక్ట్​తో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాయాలన్నారు.

    READ ALSO  Ramachandra Naik | సీఎంను కలిసిన డిప్యూటీ స్పీకర్​ రామచందర్ నాయక్

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నిక ఉంటుందని తెలిపారు. కాగా.. కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ విషయంలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....