అక్షరటుడే, వెబ్డెస్క్ : Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐ(CBI)కి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. శనివారం ఆయన మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. తప్పు చేయలేదు కాబట్టే ఈటల రాజేందర్ విచారణకు హాజరయ్యారన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ విచారణకు హాజరు కావాలని సవాల్ విసిరారు.
Kaleshwaram | బనకచర్ల మీద నిర్ణయం తీసుకోలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) మీద కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిషన్రెడ్డి తెలిపారు. వారం క్రితం బనకచర్లపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ ఇచ్చిందన్నారు. కేంద్రం ఇంకా దానిని పరిశీలించలేదని చెప్పారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దని ఆయన అన్నారు. అయితే బనకచర్లను ఎందుకు నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఆ ప్రాజెక్ట్తో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేంద్రానికి ప్రభుత్వం లేఖ రాయాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి (BJP State President) ఎన్నిక ఉంటుందని తెలిపారు. కాగా.. కొంతకాలంగా రాష్ట్ర అధ్యక్ష పదవి భర్తీ విషయంలో బీజేపీ అధిష్టానం జాప్యం చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష పదవిని భర్తీ చేస్తారని కిషన్రెడ్డి పేర్కొన్నారు.