అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (State Cooperative Corporation Chairman Manala Mohan Reddy) అన్నారు. గురువారం కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులను గేటు ముందర కూర్చోబెట్టారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప సలహాలు, సూచనలు ఇచ్చింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్(State NSUI General Secretary Venu Raj), కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాలెం నరసయ్య(Kammarpally Market Committee Chairman Palem Narasaiah), మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బూచయ్య (Market Committee Vice Chairman Boochaiah), బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, బూచి మల్లయ్య, సుంకేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.