More
    Homeజిల్లాలుజోగులాంబ గద్వాల్Jurala Project | ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్​.. పరిశీలించనున్న మంత్రి

    Jurala Project | ప్రమాదంలో జూరాల ప్రాజెక్ట్​.. పరిశీలించనున్న మంత్రి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jurala Project | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలంగాణలోని గద్వాల జిల్లా(Gadwal District)లో గల జూరాల ప్రాజెక్ట్​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. కొన్ని రోజులుగా జలాశయానికి వరద కొనసాగుతుండడంతో.. ప్రాజెక్ట్​ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ఎగువ నుంచి వస్తున్న నీటిని వదర గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు. వరద గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. అయితే గేట్లు ఎత్తే సమయంలో పలు రోప్​లు తెగిపోవడంతో ప్రాజెక్ట్ భద్రతపై ఆందోళన నెలకొంది.

    Jurala Project | తెగిపోయిన రోప్​లు

    జూరాల ప్రాజెక్ట్(Jurala Project ) గేట్లు ఎత్తడంతో గురువారం తొమ్మిదో నంబర్​గేటు రోప్​ తెగిపోయింది. మరోవైపు తాజాగా 31 నెంబర్‌ గేట్‌ ఐరన్‌ రోప్‌లు(Iron ropes) తెగిపోయాయి. 8వ గేటుకు సైతం రెండు రోప్​లు తెగిపోయాయి. 4వ గేటుకు రెండువైపులా ఒక్కో ఐరన్ రోప్‌ తెగిపోయింది. మరో ఐదు గేట్ల రోప్‌లు బలహీనంగా ఉన్నాయి. దీంతో ఆయా గేట్లను ఎత్తడం వీలయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రాజెక్ట్​ భద్రతపై దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, ఆయకట్టు రైతులు(Formers) ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  LOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    Jurala Project | పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్​

    జూరాల ప్రాజెక్ట్​ వరద గేట్ల రోప్​లు తెగిపోవడంతో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి(Minister Uttam Kumar Reddy) శనివారం పరిశీలించనున్నారు. నేడు ఆయన ప్రాజెక్ట్​ను సందర్శించి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా జూరాల ప్రాజెక్ట్​కు ఇటీవల వేసవిలో మరమ్మతులు చేపట్టారు. అయినా గేట్ల రోప్​లు తెగిపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Jurala Project | జూరాల ఎంతో కీలకం

    కృష్ణానదిపై తెలంగాణ(Telangana)లో ఉన్న తొలి ప్రాజెక్ట్​ జూరాల. దీనిని గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం దగ్గర నిర్మించారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ప్రాజెక్ట్​ నిర్మాణం ప్రారంభించగా.. 1996లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దశ నీటిని విడుదల చేసి ప్రాజెక్ట్​ను ప్రారంభించారు. 9.8 టీఎంసీల సామర్థ్యంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్​కు 62 గేట్లు ఉన్నాయి.
    ప్రాజెక్టు కుడి కాల్వను సోమనాద్రి కాలువగా పిలుస్తారు.

    READ ALSO  TG EDCET RESULTS | టీజీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

    ఈ కాలువ ద్వారా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37,700 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాల్వగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా  ఆత్మకూరు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లోని 64,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అంతేగాకుండా ఈ ప్రాజెక్ట్​ దగ్గర విద్యుత్​ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రంగా కూడా జలాశయం మారింది. ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్​ గేట్లను అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    Latest articles

    Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన వేర్పాటువాదులు.. ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు హ‌తం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pakistan | పాకిస్తాన్‌లో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మృతి చెందారు. శ‌నివారం ఖైబ‌ర్ ఫ‌ఖ్తుంక్వాలో...

    Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరింది: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరిందని బీజేపీ రాష్ట్ర...

    Pakistan Defense Minister | ఇండియా నిఘా స‌మాచారం ఇచ్చింది చైనాయే.. పాకిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Defense Minister | భార‌త్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో చైనా భార‌త్‌కు చెందిన కీల‌క‌మైన నిఘా...

    Harish Rao | జాబ్​ క్యాలెండర్​ ఎక్కడ.. సీఎంపై హరీశ్​రావు ఫైర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Harish Rao | గాంధీ కుటుంబం తెలంగాణ నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేసిందని మాజీ మంత్రి...

    More like this

    Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన వేర్పాటువాదులు.. ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు హ‌తం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pakistan | పాకిస్తాన్‌లో జ‌రిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది మృతి చెందారు. శ‌నివారం ఖైబ‌ర్ ఫ‌ఖ్తుంక్వాలో...

    Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరింది: బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah Tour | పసుపు రైతుల 30 ఏళ్ల కల నెరవేరిందని బీజేపీ రాష్ట్ర...

    Pakistan Defense Minister | ఇండియా నిఘా స‌మాచారం ఇచ్చింది చైనాయే.. పాకిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan Defense Minister | భార‌త్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్త‌త‌ల స‌మ‌యంలో చైనా భార‌త్‌కు చెందిన కీల‌క‌మైన నిఘా...