అక్షరటుడే, వెబ్డెస్క్: Junior Doctors | తెలంగాణలో జూనియర్ డాక్టర్లు (Junior doctors) కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని, స్టయిఫండ్ పెంచాలని (stipends increase) కొంతకాలంగా జూడాలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి సమ్మె చేపడుతామని వారు ప్రకటించారు.
జూడాలు సమ్మె చేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం వారి స్టైఫండ్ (stipend) భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒకే సారి 15శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసింది. మెడికల్ (Medical), డెంటల్ (Dental) స్టూడెంట్స్తో పాటు.. సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం కూడా పెంచింది. అనంతరం జూనియర్ డాక్టర్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాతో సమావేశమయ్యారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. స్టైఫండ్ పెంచడంతో రేపు తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు.