అక్షరటుడే, ఇందూరు: Journalist Vittal Vyas | జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్ విఠల్ వ్యాస్ ఐదో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని రెడ్క్రాస్ సొసైటీలో (Red Cross Society) రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
Journalist Vittal Vyas | సేవా కార్యక్రమాల నిర్వహణ అభినందనీయం
ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్ (Boddula Rajendra Prasad), ధన్పాల్ వినయ్(Dhanpal Vinay), సందీప్ రావ్ (Sandeep Rao) హాజరై మాట్లాడుతూ.. విఠల్వ్యాస్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. అ సందర్భంగా జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ (Jamalpur Vittal Vyas Memorial Society) నిర్వాహకులను అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డా జమాల్పూర్ రాజశేఖర్(Jamalpur Rajasekhar), ఆర్అండ్బీ రిటైర్డ్ ఈఈ శ్రీమన్నారాయణ, రెడ్క్రాస్ సొసైటీ ఛైర్మన్ ఆంజనేయులు, మెడికల్ ఆఫీసర్ రాజేష్, జేసీఐ అలుమ్నీ(JCI Alumni) వైస్ ఛైర్మన్ విజయానంద్, నిజామాబాద్ ప్రెస్క్లబ్ కార్యదర్శి శేఖర్, తదితరులున్నారు.