అక్షరటుడే, ఇందూరు: JCI Indur : హైదరాబాద్(Hyderabad)లోని ఒక ప్రైవేటు హోటల్ (కత్రియా)లో ఆదివారం జరిగిన “ట్రినిటీ మిడ్ కాన్ఫరెన్స్”(Trinity Mid Conference) 2025లో.. జేసీఐ ఇండియా, జోన్ 12 , రీజియన్- B ఉపాధ్యక్షులు దిలీప్ మల్లా వివిధ కేటగిరీల్లో ఉత్తమ, అత్యుత్తమ అవార్డులను జేసీఐ ఇందూర్కు అందచేశారు.
2025 జేసీఐ రైస్ అప్ అవార్డ్, నేషనల్ ఫ్లాగ్షిప్ (National Flagship) అవార్డ్, ఉత్తమ రిపోర్టింగ్, ఉత్తమ అధ్యక్షురాలు గౌతమి, ఉత్తమ కార్యదర్శి జైపాల్, ఉత్తమ మహిళా సభ్యురాలుగా తేజస్వి, నూతన సభ్యుడు యశ్వంత్తో పాటు వివిధ కార్యక్రమాలకు గాను పురస్కారాలు లభించాయి.
ఉత్తమ జోన్ అధికారిగా నయన్కు జోన్ 12, రీజియన్ – A ఉపాధ్యక్షులు సంకీత్ జైన్కు స్పెషల్ అవార్డు అందజేశారు.
కార్యక్రమంలో రీజియన్ – C ఉపాధ్యక్షులు వేణుగోపాల్, ఇందూర్ సభ్యులు నిపున్, చేకృత్, మధు పాల్గొన్నారు.