అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jawaharlal Nehru | భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (The first Prime Minister of India) సేవలు మరువలేనివని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
నగరంలోని పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యూత్ కాంగ్రెస్(Youth Congress) మాజీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఎన్ఎస్యూఐ(NSUI) ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మాట్లాడుతూ.. నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన గొప్ప నాయకుడని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఫిషర్మన్ అసోసియేషన్ (Fisherman’s Association) ఛైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ దశ గౌడ్, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు వినయ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, జిల్లా ప్రతినిధి ప్రమోద్, అవిన్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్, నరేంద్ర సింగ్, స్వామి గౌడ్, పుప్పాల విజయ, సంగెం సాయిలు, ముశ్షు పటేల్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.