అక్షరటుడే, వెబ్డెస్క్: IVF : ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం కన్న కలలు ఒకే రోజు కవలల రూపంలో వారి కళ్ల ముందుంచారు కరీంనగర్(Karimnagar)కు చెందిన డా. పద్మజ(Dr.Padmaja). సంతానం లేక అనేక సందేహాలతో తొమ్మిది నెలల క్రితం తమ వద్దకు వచ్చిన ఆరుగురికి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భధారణ చేసి, ఒకే రోజు కవల పిల్లలను అందించారు డా. పద్మజ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ viral video అవుతోంది.
ఇక పిల్లలు పుట్టరు.. నేనింక తల్లిని కాలేను.. నాకింక పిల్లలను చూసే భాగ్యం లేదని బాధపడిన ఆ మాతృమూర్తులకు కరీంనగర్కు చెందిన డా.పద్మజ వరాలు కురిపించారు. సంతానం లేక బాధపడుతున్న ఆరుగురు తల్లులకు ఒకేసారి కవలలు జన్మింపజేశారు. ఈ ఘటన గత నెల(మే 30)లో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగుచూసింది.
తమ కడుపున పుట్టిన ముద్దులొలికే శిశువులను చూసిన ఆ మాతృమూర్తులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక తమ జన్మ ధన్యమైందని అంటున్నారు. ఇందుకు ఆ వైద్యురాలికి కృతజ్ఙతలు తెలుపుతున్నారు.