More
    HomeUncategorizedsocial media influencers ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆట కట్టు.. చర్యలకు ఐటీ స్టాండింగ్...

    social media influencers ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఆట కట్టు.. చర్యలకు ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశం

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: social media influencers : మన దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా, సార్వభౌమాధికారిన్ని ధిక్కరించేలా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న సామాజిక మాధ్యమ ఛానెళ్లను నిషేధించడంతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

    social media influencers : సోషల్ మీడియాలో దుష్ప్రచారం..

    2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లోని పహల్గావ్​లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇదివరకే భారత్‌కు వ్యతిరేకంగా దేశ మీడియా డిబేట్స్ లో పాకిస్తానీయులు పాల్గొనకండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. తాజాగా దేశంలోని కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా సంస్థ ప్రతినిధులు తమ స్వార్థం కోసం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని గుర్తించింది. ఆ కంటెంట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పోస్టులు హింసను ప్రేరేపించే అవకాశం ఉందని భావిస్తోంది.

    READ ALSO  Ballistic Missile | బాలిస్టిక్ క్షిపణుల తయారీపై పాక్ దృష్టి.. రహస్యంగా తయారు చేస్తుందన్న అమెరికా నిఘావర్గాలు

    social media influencers : ఆ సోషల్ ఖాతాలపై కేంద్రం నిషేధం

    ఈ విషయంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు ఐటీ చట్టం 2000, ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021’ ప్రకారం దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ పోస్టు చేస్తున్న ఛానళ్లు, ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించాలని ప్రతిపాదనలు పంపించాయి.

    కేంద్ర మంత్రిత్వశాఖలు పక్కా సమాచారంతోనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలతో పాటు సోషల్ మీడియా ఖాతాలు నిషేధించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం స్టాండింగ్ కమిటీకి కావలసిన సమాచారాన్ని మే 8, 2025 లోగా మనలో ఎవరైనా పంపవచ్చు. దాని సాఫ్ట్ కాపీని comit@sansad.nic.in కు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది.

    social media influencers : మే 7న దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్

    భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రక్షణ కోసం మే 7, 2025న దేశ వ్యాప్తంగా సమర్థవంతంగా మాక్ డ్రిల్‌ నిర్వహించాలంది. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్ లో ప్రత్యక్షంగా వివరిస్తారు. ఇందులో అధికారులతోపాటు ప్రజలు, వివిధ సంస్థలు, వ్యవస్థలు పాల్గొననున్నాయి.

    READ ALSO  Pakistan | పాకిస్తాన్‌కు షాకిచ్చిన వేర్పాటువాదులు.. ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు హ‌తం

    Latest articles

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 29 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – ఆషాఢపక్షం...

    More like this

    Amit Shah | నేడు రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రాక..

    అక్షరటుడే, ఇందూరు: Amit Shah | తెలంగాణ రాష్ట్రానికి నేడు కేంద్ర మంత్రి అమిత్​షా వస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో...

    Yoga Asanas | వర్షాకాలంలో కీళ్ల నొప్పులు.. ఈ యోగాసనాలతో దూరం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Yoga Asanas | వర్షాకాలంలో వాతావరణంలో మార్పులతో అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తే అవకాశాలు...

    Media | పెరిగిన విష సంస్కృతి.. మీడియాపై దాడి.. ఉన్మాద స్థాయికి దిగజారిన రాజకీయాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Media : ప్రజాస్వామ్యం(democracy)లో నాలుగో స్తంభంగా పేర్కొనే మీడియా సంస్థలపై ఇటీవల దాడులు పెరిగిపోయాయి. రాజకీయ,...