అక్షరటుడే, బాన్సువాడ: Ration Cards | నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్, కోటగిరి, పోతంగల్ మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. అనంతరం ఆయా మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా దీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండ్రస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.