అక్షరటుడే, వెబ్డెస్క్:Iran-Israel | ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాల్లో బాంబుల మోత మోగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్లోని అణుస్థావరాలే(Nuclear power plants) లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేపట్టగా.. ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. రెండు దేశాలు వెనక్కి తగ్గకుండా క్షిపణులు ప్రయోగిస్తున్నాయి.
Iran-Israel | దాడులను ఖండించాలి
ఈ క్రమంలో ఇరాన్లోని క్షిపణి స్థావరాలు, కీలక అణుకేంద్రాలపైనా టెల్అవీవ్(Tel Aviv) దాడులు చేస్తోంది. ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తుండటంతో సైరన్లు మోగుతున్నాయి. దీంతో ప్రజలు భయంతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను భారత్(India) ఖండించాలని ఇరాన్ కోరుతోంది. ఇరుదేశాల యుద్ధంపై భారత్ తటస్థంగా ఉంది. రెండు దేశాలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ సూచించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం దాడులను ఖండించాలని భారత్ను కోరుతోంది. ఇరాన్ నష్టపోతే మిగితా దేశాలపైనా ఆ ప్రభావం పడుతుంది ఇరానియన్ ఎంబసీ(Iranian Embassy) పేర్కొంది.
Iran-Israel | భారతీయుల తరలింపు
యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చర్యలు చేపట్టింది. భారతీయుల తరలింపు కోసం ఇప్పటికే ఇరాన్ తన గగనతలాన్ని తెరిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు పలువురు భారతీయు ఢిల్లీకి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానాల్లో అక్కడ చిక్కుకున్న వారిని తరలిస్తున్నారు.