అక్షరటుడే, వెబ్డెస్క్:Iran – Israel | ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా గురువారం రాత్రి ఇజ్రాయెల్ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట దాదాపు 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు ఆ దేశ అణు శాస్త్రవేత్తలు(Nuclear scientists), మిలటరీ కీలక నేతల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేసింది. అనంతరం ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్(Israel) విడుదల చేసిన ఓ మ్యాప్ వివాదాస్పదమైంది. దీంతో ఆ దేశం భారత్(Bharath)కు క్షమాపణ చెప్పింది.
Iran – Israel | ఇరాన్ మిసైల్ పరిధి చూపేలా..
ఇరాన్(Iran)తో ఉద్రిక్తతల వేళ ఆ దేశ క్షిపణుల పరిధి తెలిపేలా ఓ మ్యాప్ విడుదల చేసింది. ఆ మ్యాప్లో భారత్ను తప్పుగా చూపించింది. జమ్మూ కశ్మీర్ను పాకిస్తాన్లో, ఈశాన్య రాష్ట్రాలను నేపాల్లో ఉన్నట్లు మ్యాప్ ఉంది. దీనిపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ ఈ విషయాన్ని ఇజ్రాయెల్ దృష్టికి తీసుకుళ్లింది. దీంతో స్పందించి ఆ దేశం భారత్కు క్షమాపణ చెప్పింది.
Iran – Israel | ఇది ఆరంభం మాత్రమే..
ఇరాన్ మిసైళ్లతో(Iran missiles) ప్రపంచానికి ముప్పు ఉందని చెప్పేందుకు ఆ దేశ క్షిపణుల పరిధిని సూచిస్తూ ఇజ్రాయెల్ ఢిపెన్స్ ఫోర్స్ (IDF) మ్యాప్ విడుదల చేసింది. ఆ మ్యాప్ ప్రకారం ఇరాన్ క్షిపణుల పరిధిలోకి భారత్, రష్యా, చైనా సహా 15 దేశాలు వస్తున్నాయి. దీంతో ఇరాన్ అణు శక్తిగా మారితే ప్రపంచానికి ముప్పు పొంచి ఉంటుందని ఐడీఎఫ్(Israel Defense Force) పేర్కొంది. దీంతోనే తాము దాడి చేశామని తెలిపింది. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొంది. తమకు మరో అవకాశం లేదని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే మ్యాప్లో భారత్ను తప్పుగా చూపెట్టడంపై ఆ దేశం క్షమాపణ చెప్పింది.