అక్షరటుడే, ఇందూరు: Red Cross Society | నిజామాబాద్ రెడ్క్రాస్ సొసైటీని రాష్ట్ర గవర్నర్ ఐఎస్వో అవార్డుతో (ISO Award) సత్కరించారు. శనివారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం (World Blood Donor Day) పురస్కరించుకొని రాజభవన్లో (Raj bhavan) నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) అవార్డును అందజేశారు.
జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అత్యధికంగా రక్తదాన శిబిరాలు, తలసేమియా అవగాహన సదస్సులు నిర్వహించినందుకు ఐఎస్వో సర్టిఫికెట్ ప్రదానం చేశారు. అలాగే అత్యధికంగా 65సార్లు రక్తదానం చేసిన గంగాధర్కు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.