అక్షరటుడే, వెబ్డెస్క్ :True Promise 3 | ఇరాన్పై ఇజ్రాయెల్ (Israel) దాడులతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. గురువారం రాత్రి ఇరాన్లోని అణుస్థావరాలు, సైనిక నేతలు, అణు శాస్త్రవేత్తలే(Nuclear scientists) లక్ష్యంగా దాడులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ ప్రతి దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్(Ballistic missiles)తో దాడులు చేసింది.
True Promise 3 | ట్రూ ప్రామిస్ 3 పేరిట
ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిగా ఆ దేశానికి భారీ నష్టం కలిగిస్తామంటూ ఇరాన్ సుప్రీం నేత (Iran Supreme Leader) ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే ‘ట్రూప్రామిస్ 3’ పేరుతో ఇరాన్ ఆపరేషన్ చేపట్టింది. క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఇరాన్ వంద వరకు మిసైళ్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. వాటిలో చాలావరకు మధ్యలోనే కూల్చివేశామని చెప్పారు.
True Promise 3 | ఇరాన్ సుప్రీం లీడర్ లక్ష్యంగా..
ఇరుదేశాలు శుక్రవారం మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డాయి. ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లు ప్రయోగించడంతో టెల్అవీవ్ సైతం దీటుగానే బదులిచ్చింది. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడం గమనార్హం. ఆయన లక్ష్యంగా దాడులు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ (Operation Rising Lion) పేరుతో గురువారం రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. మరో 329 మంది గాయపడ్డారు.