అక్షరటుడే, వెబ్డెస్క్ :Iran | ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్(Israel) వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్లోని కీలక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడులతో రెండు దేశాల్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో అప్రమత్తమైన ఇరాన్(Iran) ఇప్పటికే తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 16 ఎయిర్ ఇండియా విమానాల(Air India flights) రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇరాన్ గగనతలం మూసివేతతో పలు విమానాలు వెనక్కి మళ్లాయి. మరికొన్ని విమానాలను అధికారులు ముందుగానే రద్దు చేశారు.
Iran | మూడు గంటలు గాలిలోనే..
ముంబయి నుంచి లండన్ బయలు దేరిన ఎయిర్ ఇండియా విమానం మూడు గంటలు గాలిలోనే చక్కర్లు కొట్టింది. శుక్రవారం ఉదయం 5:39 గంటలకు ముంబయి ఎయిర్పొర్ట్(Mumbai Airport) నుంచి AIC 129 విమానం లండన్ బయలు దేరింది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమాసియా ప్రాంతాల్లో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించాయి. దీంతో ఈ విమానం మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్పొర్ట్కు వచ్చింది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad plane crash)తో భయాందోళనలో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనలో మరింత భయపడియారు. విమానం గాలిలో ఉండటంతో ఆందోళన చెందారు. కాగా విమానం సురక్షితంగా ముంబయిలో ల్యాండ్ కావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.