More
    Homeక్రీడలుIPL 2025 | నేడే క్వాలియ‌ర్ 1 మ్యాచ్.. వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంటి?

    IPL 2025 | నేడే క్వాలియ‌ర్ 1 మ్యాచ్.. వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ప‌రిస్థితి ఏంటి?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:IPL 2025 | ఐపీఎల్ 2025లో ఇక చివ‌రి ఘ‌ట్టంకి స‌మ‌యం ఆస‌న్నమైంది. మొత్తం నాలుగు జ‌ట్లు ప్లే ఆఫ్స్‌(Play off)కి చేరుకోగా వాటిలో పంజాబ్(Punjab), ఆర్సీబీ(RCB), జీటీ, ముంబై ఉన్నాయి.

    ఈ రోజు నుండి ప్లే ఆఫ్స్ స‌మ‌రం మొద‌లు కానుంది. ఆర్సీబీ జట్టు మే 29న జరిగే ప్లేఆఫ్స్ క్వాలిఫయర్-1 Qualifier 1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్సీబీ జట్టుకు ముల్లన్‌పూర్‌లోని స్టేడియం(Mullanpur Stadium)లో పంజాబ్ కింగ్స్ జట్టుపై మంచి రికార్డు కూడా ఉంది. ఈ సారి ఎలాగైనా గెలిచి కప్ కొట్టాలనే క‌సితో ఆర్సీబి ఉంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్(High-voltage match cricket) అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే, రెండు జట్లు ఫైనల్స్‌కు చేరుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

    IPL 2025 | అంతా స‌స్పెన్స్..

    అయితే ఇక్క‌డ ఓ సందేహం ఉంది. ఈ మ్యాచ్ వర్షం వల్ల లేదా మరేదైనా కారణం వల్ల రద్దు అయితే, ఏ జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్లేఆఫ్‌ల కోసం బీసీసీఐ BCCI ప్రత్యేక నియమాలను రూపొందించిందా అనేది చూద్దాం.

    ఐపీఎల్ (IPL) క్వాలిఫైయర్-1 అనేది ప్లేఆఫ్స్‌లో మొదటి పెద్ద దశ. దీనిలో లీగ్ దశలో టాప్-2 జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు ప్రవేశిస్తుంది. ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్-2లో మరో అవకాశం లభిస్తుంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో వాతావరణం(Weather) ఎల్లప్పుడూ ఒక సవాలుగా ఉంటుంది. అదే సమయంలో, క్వాలిఫైయర్-1 మ్యాచ్‌కు రిజర్వ్ డేను ఉంచలేదు. వర్షం, బ్యాడ్ వెదర్ లేదా మరేదైనా కారణం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే, ఒక జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

    మ‌రి ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో పంజాబ్(Punjab) జ‌ట్టు అగ్ర‌స్థానంలో ఉండ‌గా, ఆ జ‌ట్టు డైరెక్ట్‌గా ఫైన‌ల్ కి వెళుతుంది. అప్పుడు బెంగళూరు క్వాలిఫయర్-2 ఆడవలసి ఉంటుంది. మ్యాచ్‌కి వ‌ర్షం ముప్పు ఉంద‌ని అటున్నారు. అభిమానులు మాత్రం హై ఓల్టేజ్ మ్యాచ్ క‌ళ్లారా చూడాల‌ని , వ‌ర్షం(Rain) ప‌డొద్ద‌ని ప్రార్ధిస్తున్నారు. ఈ పిచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ అయిన మైదానంలో పంజాబ్ కింగ్స్ ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు.

    పంజాబ్ కింగ్స్ (Punjab Kings)ఇక్కడ ఆడిన మొత్తం 4 మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోయింది. అదే సమయంలో వారు ఏప్రిల్ 20న లీగ్ దశలో ఈ మైదానంలో ఆర్సీబీ(RCB)తో కూడా ఆడారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో దారుణంగా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో ఆర్సీబీ మరోసారి పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించే అవకాశం ఉందా అనేది చూడాలి.

    Latest articles

    MLC Kavitha | కేసీఆర్​ మీద ఈగ కూడా వాలనివ్వను: ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు బీఆర్​ఎస్​తో పాటు...

    Prajavani | ప్రజావాణి వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్...

    Operation Sindoor | యుద్ధ విమానాలను కోల్పోయాం..తొలిసారి అంగీకరించిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:Operation Sindoor | పాకిస్తాన్తో జరిగిన ఘర్షణల్లో యుద్ధ విమానాలను కోల్పోయామని భారత సైన్యం(Indian Army) తొలిసారిగా...

    Srileela | ఎట్ట‌కేల‌కు త‌న ఎంగేజ్‌మెంట్ వార్త‌ల‌పై స్పందించిన శ్రీలీల‌.. ఆ సెల‌బ్రేష‌న్స్ ఏంటంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌: Srileela | టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల Sreeleela నిశ్చితార్థం అంటూ గ‌త రెండు రోజులుగా ప‌లు...

    More like this

    MLC Kavitha | కేసీఆర్​ మీద ఈగ కూడా వాలనివ్వను: ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు బీఆర్​ఎస్​తో పాటు...

    Prajavani | ప్రజావాణి వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్...

    Operation Sindoor | యుద్ధ విమానాలను కోల్పోయాం..తొలిసారి అంగీకరించిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:Operation Sindoor | పాకిస్తాన్తో జరిగిన ఘర్షణల్లో యుద్ధ విమానాలను కోల్పోయామని భారత సైన్యం(Indian Army) తొలిసారిగా...