అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL 2025 | భారత్, పాకిస్థాన్ (india – pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ‘ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు క్రికెట్ మ్యాచ్లు (cricket matches) నిర్వహించడం సరైంది కాదనిపించింది’అని ఓ బీసీసీఐ (BCCI) అధికారి మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో టోర్నీ (cricket tounament) నిర్వహణ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరికాసేపట్లో పూర్తి వివరాలను బీసీసీఐ మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
ఈ సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లతో పాటు రెండు క్వాలిఫయర్స్ (two quallifier matches), ఒక ఎలిమినేటర్ (eliminator match), మరో ఫైనల్ మ్యాచ్ (final match) నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే25న కోల్కతా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది (final match schedualed in kolkata). ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ (punjab kings and delhi capitals) మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ భద్రతా కారణాలరీత్యా మధ్యలోనే రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్ (operation sindoor) కారణంగా భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త (indiia-pakistan tension) పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్కు (operation sindoor) ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు (pakistan attacks) ఎగబడటంతో భారత్ సైన్యం (indian army) తిప్పికొట్టింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు (australia players) తమ స్వదేశానికి వెళ్తామని బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ భయాందోళనకు గురవ్వడంతో పాటు.. మ్యాచ్ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాల్గా మారడంతోనే బీసీసీఐ టోర్నీని వాయిదా వేసినట్లు (BCCI postponed tournament) తెలుస్తోంది.
రెండు వారాల తర్వాత పరిస్థితి అదుపులోకి వస్తే ఐపీఎల్ 2025 సీజన్ను (IPL 2025 season) కొనసాగించే అవకాశం ఉంది. జూన్ 11 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ విండో (international cricket window) ఖాలీగా ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2025తో ఇంటర్నేషనల్ క్రికెట్ ప్రారంభమవుతోంది (insternational cricket starts with WTC 2025 final). ఒకవేళ ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025 season) తిరిగి ప్రారంభమైనా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు (australia and south africa players) పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారింది. జూన్ 11 నుంచి 15 మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC final) ఇరు జట్లు తలపడనున్నాయి. ఇలా ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా వేయడం రెండోసారి. గతంలో కరోన కారణంగా ఐపీఎల్ను మధ్యలోనే వాయిదా వేసారు.