అక్షరటుడే, ఇందూరు: Inter Supplementary Evaluation | ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుందని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar) తెలిపారు.
ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకన విధుల్లో పాల్గొనేందుకు అధ్యాపకుల ఆర్డర్ కాపీలను కళాశాల లాగిన్లలో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. అలాగే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు (Private colleges) విధుల్లో పాల్గొనేందుకు తమ అధ్యాపకులను రిలీవ్ చేయాలన్నారు. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులు 29న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర జూనియర్ కళాశాలలో (qilla Boys Junior College nizamabad) రిపోర్ట్ చేయాలని సూచించారు.