అక్షరటుడే, కామారెడ్డి: All India Banjara Association | రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి(kamareddy) పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు అంమి మండలాల కమిటీలు నియమించాలని, ఆ తర్వాత జిల్లా కమిటీ నియమించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో(assembly elections) దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా గిరిజనుల ఓట్లతో గెలిచారన్నారు.
అలాంటిది మంత్రివర్గంలో గిరిజనులకు మాత్రం అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో 50 శాతం గిరిజనులకు పోడు పట్టాలు వచ్చాయని, ఈ ప్రభుత్వ హయాంలో అందరికి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయకులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రెడ్డి నాయక్, సదర్ నాయజ్, ఆనంద్ నాయక్, సర్వన్ నాయక్, రాంచంద్రం నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రమేష్ నాయక్ పాల్గొన్నారు.