అక్షరటుడే, హైదరాబాద్: Helium Gas : పని ఒత్తిడి భరించలేదక ఛార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్ చేసుకున్నాడు. హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన గచ్చిబౌలి ఠాణా(Gachibowli police station) పరిధిలో చోటుచేసుకుంది.
కొండాపూర్(Kondapur) రాజేశ్వరి కాలనీలోని సర్వీస్ అపార్టుమెంట్లో ఉండే సురేష్ రెడ్డి మణికొండ(Manikonda)లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఛార్టర్డ్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. జూన్ 16న తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రాజేశ్వరి కాలనీలోని తన గదిలో సూసైడ్ చేసుకున్నాడు.
సురేష్ తలకు కవర్ కట్టుకుని.. దానికి చిన్న రంధ్రం చేసుకుని, అందులోనుంచి హీలియం గ్యాస్ పీల్చి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గదిలోని హీలియం గ్యాస్ సిలిండర్, ఆత్మహత్య నోట్ను స్వాధీనం చేసుకున్నారు. పనిఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుంటున్నట్లు నోట్లో సురేష్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. సురేష్ రెడ్డిది సొంతూరు కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం(Palvancha mandal) వాడి గ్రామం.