Site icon aksharatoday.in

Government Schools | ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Government Schools

Government Schools | ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

అక్షరటుడే, ఇందూరు: Government Schools | ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి (BJYM district president Satish Reddy) డిమాండ్ చేశారు. నిజామాబాద్జి జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం నిరసన తెలిపారు. డీఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల దందా, స్కాలర్షిప్ విడుదలపై నిర్లక్ష్యం వంటి సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్​, యాదాల నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్, సాయి కుమార్, సురేష్, ప్రశాంత్, విపుల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version