అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగర జర్నలిస్టులకు నెలరోజుల్లోగా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ (PCC Chief) బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) హామీ ఇచ్చారు.
జర్నలిస్టులకు ఇళ్లస్థలాల సాధన నిమిత్తం జర్నలిస్టులు హైదరాబాద్ తరలివెళ్లారు. గాంధీభవన్లో (Gandhi Bhavan) పీసీసీ చీఫ్ను కలిసి సమస్యను విన్నవించారు. నివాసయోగ్యం కాని గుండారం (Gundaram) గుట్టల్లో కాకుండా నగరానికి సమీపంలో జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం షబ్బీర్అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారిరువురు సానుకూలంగా స్పందించారని.. విలేకరులకు నివాసయోగ్యమైన స్థలాలను పరిశీలించి ఇవ్వాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) ఆదేశించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని.. బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, షబ్బీర్అలీ హామీ ఇచ్చారని వారు స్పష్టం చేశారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసిన నగర జర్నలిస్టులు