Site icon aksharatoday.in

Nizamabad City | నెలరోజుల్లోగా నగర జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు

Nizamabad City

Nizamabad City | నెలరోజుల్లోగా నగర జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగర జర్నలిస్టులకు నెలరోజుల్లోగా ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ (PCC Chief)​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) హామీ ఇచ్చారు.

జర్నలిస్టులకు ఇళ్లస్థలాల సాధన నిమిత్తం జర్నలిస్టులు హైదరాబాద్​ తరలివెళ్లారు. గాంధీభవన్​లో (Gandhi Bhavan) పీసీసీ చీఫ్​ను కలిసి సమస్యను విన్నవించారు. నివాసయోగ్యం కాని గుండారం (Gundaram) గుట్టల్లో కాకుండా నగరానికి సమీపంలో జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం షబ్బీర్​అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారిరువురు సానుకూలంగా స్పందించారని.. విలేకరులకు నివాసయోగ్యమైన స్థలాలను పరిశీలించి ఇవ్వాలని కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) ఆదేశించారని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలే కాకుండా ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తామని.. బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​, షబ్బీర్​అలీ హామీ ఇచ్చారని వారు స్పష్టం చేశారు.

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీని కలిసిన నగర జర్నలిస్టులు

Exit mobile version