More
    HomeతెలంగాణNizamabad | ధాన్యం సేకరణలో అగ్రగామిగా ఇందూరు.. సీఎం ప్రశంసలు

    Nizamabad | ధాన్యం సేకరణలో అగ్రగామిగా ఇందూరు.. సీఎం ప్రశంసలు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | యాసంగి సీజన్​కు సంబంధించి వరి ధాన్యం (Rice grain) సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) పాటు మంత్రులు అభినందించారు.

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Batti Vikramarka), మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 8.19 లక్షల మెట్రిక్ వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన ధాన్యాన్ని సైతం పూర్తిస్థాయిలో సేకరించేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎవరైనా మిల్లర్లు, దళారులు రైతులను నష్టపర్చే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

    READ ALSO  CM Revanth Reddy | ప్ర‌భుత్వం క‌ఠినంగా క‌నిపిస్తుంది.. కానీ మీకు ఏం కావాలో చెప్పండి.. చేసి తీరుతామ‌న్న సీఎం రేవంత్

    Nizamabad | పీడీయాక్ట్​ అమలు చేయాలని ఆదేశాలు..

    ముందస్తుగానే రుతుపవనాలు ప్రవేశించినందున తదనుగుణంగా ఖరీఫ్ సీజన్​కు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నకిలీ, నాసిరకం విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) అమలు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో భూభారతి (bhubarathi) రెవెన్యూ సదస్సులు నిర్వహించేలా ప్రణాళికల రూపొందించుకోవాలని చెప్పారు. జిల్లా ఇన్​ఛార్జి మంత్రులు ఈనెల 28, 29 తేదీల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరపాలని పేర్కొన్నారు.

    Nizamabad | అధికారులకు కలెక్టర్​ సూచనలు..

    అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) జిల్లాలో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో గతేడాది ఇదే సమయానికి 4.34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిపి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు.

    READ ALSO  Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కీలక అప్​డేట్.. నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

    700 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టామని, కొనుగోలు పూర్తయిన నేపథ్యంలో 625 కేంద్రాలను మూసివేశామన్నారు. సన్న రకం ధాన్యం 7.25 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. దొడ్డు రకం 93.24 వేల మెట్రిక్ టన్నులు మాత్రమేనని వివరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి 10 లక్షల మంది రైతులకు వారి ఖాతాలో రూ.1,786 కోట్ల బిల్లుల చెల్లింపులు పూర్తయ్యాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీవో సాయా గౌడ్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...

    Mopal | ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mopal | షెడ్ల నిర్మాణం కోసం సంతకం పెట్టకుండా ఎంపీడీవో(MPDO), పంచాయతీ కార్యదర్శి (GP...

    More like this

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ధరణి వెంచర్(Dharani Venture)లో మౌలిక వసతులు కల్పించి తమకు న్యాయం చేయాలని బాధితులు...