అక్షరటుడే, నిజాంసాగర్: Indiramma housing scheme | అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని మహమ్మద్ నగర్ (Mahammad Nagar) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మహమ్మద్నగర్ మండలంలోని మగ్దుంపూర్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేసి భూమిపూజ చేశారు.
అనంతరం సింగితం (Singitam) గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులకు పథకాలు అందజేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో సవాయ్సింగ్, నాగభూషణం, ఖాలిక్, మల్లయ్య గారి ఆకాష్, గంగి రమేష్, మోయిన్, అజయ్, కిష్టయ్య, హతిక్ తదితరులు పాల్గొన్నారు.