అక్షరటుడే, బాన్సువాడ: Indiramma Housing Scheme | నిరుపేదలందరికీ ఇళ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivasa Reddy) అన్నారు. వర్ని మండల కేంద్రంలోని సీసీడీ ఫంక్షన్హాల్లో వర్ని, చందూర్, మోస్రా, రుద్రుర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 803 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశామన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందించనున్నట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.