ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    IndiGo Flight | 40 నిమిషాలపాటు గాలిలోనే ఇండిగో విమానం చక్కర్లు.. భయం గుప్పిట్లో ప్రయాణికులు..

    Published on

    అక్షరటుడే, తిరుమల: IndiGo Flight | ఆంధ్రప్రదేశ్​ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) లో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఇండిగో విమానం (IndiGo plane) సుమారు 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ సమస్య ఏర్పడింది. ఎట్టకేలకు 40 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతిలోనే ల్యాండ్ అయింది.

    కాగా, ఈ ఘటన జరిగిన తర్వాత విమాన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టు ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడం ఇందుకు కారణం. విమానంలో సాంకేతిక లోపం, 40 నిమిషాలపాటు గాలిలోనే చక్కర్లకు తోడు విమానాశ్రయంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

    IndiGo Flight | ఇటీవలే..

    ముంబయి(MUMBAI)లో ఇలాంటి ఘటనే ఇటీవల చోటుచేసుకుంది. ఇండిగో విమానానికి చెందిన ఇంజిన్​ గాలిలో ఉండగానే ఫెయిల్ అయ్యింది. దీంతో ప్రయాణికులు భయంతో గుండెను అరచేతిలో పట్టుకున్నంత పనిచేశారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

    READ ALSO  KTR | నిధులు రాహుల్​గాంధీకి, నీళ్లు చంద్రబాబుకు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

    కాగా, అప్రమత్తమైన పైలట్.. ప్యాన్ ప్యాన్ ప్యాన్.. అని ఏటీసీకి సందేశం పంపించాడు. దీని అర్థం.. ప్రాణాపాయం లేదు కానీ, ఎమర్జెన్సీగా ల్యాండ్ కావాలని పైలట్ పంపే సందేశం. అయితే, ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చింది.

    దీంతో విమానాన్ని వెంటనే పైలట్​ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం(Chhatrapati Shivaji Maharaj International Airport)లో ఎమర్జెన్సీగా ల్యాండ్​ చేశాడు. అలా ప్రమాదం తప్పింది. కాగా, ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.

    ఈ విమానం దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు నుంచి గోవాకు బయలుదేరింది. కాగా, గాలిలో ఉండగానే ఇంజిన్ ఫెయిల్ కావడంతో ముంబయిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. భువనేశ్వర్​ ఉత్తరాన 100 నాటికల్ మైళ్ల దూరంలో విమానం ఎగురుతున్నప్పుడు ఇంజిన్​ ఫెయిల్​ అయినట్లు అధికారులు తెలిపారు.

    READ ALSO  Weather Updates | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    కాగా, అహ్మదాబాద్​లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో 282 మంది మరణించారు. వసతి గృహంపై విమానం కుప్పకూలడంతో వైద్య విద్యార్థులు సైతం దుర్మరణం చెందారు.

    ఈ ఘటన తర్వాత విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు వెలుగు చూడటం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనికితోడు ఇటీవల తిరుపతికి వెళ్లే విమానాలు తరచూ సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొన్ననే సాంకేతిక సమస్యతో తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్​ శంషాబాద్​ విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడేమో ఏకంగా గాలిలో ఉండగానే ఇండిగో విమానం ప్రయాణికులకు 40 నిమిషాల పాటు చుక్కలు చూపించింది.

    Latest articles

    Ration Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్​ నాయకులు...

    BHVL IPO | మార్కెట్​లోకి మరో ఐపీవో.. జూలై 24న ప్రారంభం కానున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ సబ్​స్క్రిప్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: BHVL IPO | బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (BHVL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)...

    Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    అక్షరటుడే, ఆర్మూర్​: Mla Rakesh reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి పర్యటన...

    Meghalaya Murder Case | మేఘాల‌య హ‌నీమూన్ హ‌త్య కేసుపై సినిమా.. ఏకంగా బ‌డా హీరోనే ప్లాన్ చేశాడుగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Meghalaya Murder Case | మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

    More like this

    Ration Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్​ నాయకులు...

    BHVL IPO | మార్కెట్​లోకి మరో ఐపీవో.. జూలై 24న ప్రారంభం కానున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ సబ్​స్క్రిప్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: BHVL IPO | బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (BHVL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)...

    Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    అక్షరటుడే, ఆర్మూర్​: Mla Rakesh reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి పర్యటన...