అక్షరటుడే, వెబ్డెస్క్: Stock market | భారత్(Bharath), పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. శుక్రవారం ఉదయం భారీ గ్యాప్డౌన్తో ప్రారంభమైనా.. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఉదయం 1,366 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. కనిష్ట స్థాయి నుంచి ఇంట్రాడేలో గరిష్టంగా వెయ్యి పాయింట్లకుపైగా పెరిగింది. 338 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ(Nifty).. కనిష్టాల వద్దనుంచి 230 పాయింట్లు పెరిగింది.
కానీ వీకెండ్ కావడంతో ఇన్వెస్టర్లు ఇంట్రాడే (Intraday)లో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు మళ్లీ పతనమయ్యాయి. చివరికి సెన్సెక్స్ 880 పాయింట్ల నష్టంతో 79,454 వద్ద, నిఫ్టీ 265 పాయింట్ల నష్టంతో 24,008 వద్ద స్థిరపడ్డాయి. భారత్, పాక్ల మధ్య ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనన్న భయాలకుతోడు డాలర్ ఇండెక్స్ (Dollar index) బలపడుతూ తిరిగి వంద మార్క్ను చేరుకోవడం, క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురయ్యింది.
బీఎస్ఈ(BSE)లో 1,343 కంపెనీలు లాభపడగా 2,522 స్టాక్స్ నష్టపోయాయి. 145 కంపెనీలు ఫ్లాట్(Flat)గా ఉన్నాయి. 52 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 190 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 15 కంపెనీలు అప్పర్ సర్క్యూట్ను, 7 కంపెనీలు లోయర్ సర్క్యూట్ను తాకాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ(Market cap) రూ. 2.7 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
stock market | ప్రధాన సెక్టార్లలో సెల్లాఫ్..
పీఎస్యూ(PSU), కన్జూమర్ డ్యూరెబుల్, క్యాపిటల్ గూడ్స్ (consumer durables and capital goods)(ప్రధానంగా డిఫెన్స్ స్టాక్స్) సెక్టార్లు మినహా మిగతా అన్ని సెక్టార్లు సెల్లాఫ్కు గురయ్యాయి. బీఎస్ఈ లార్జ్ క్యాప్ (Large cap) ఇండెక్స్ 0.83 శాతం నష్టపోగా.. స్మాల్ క్యాప్ 0.30 శాతం, మిడ్ క్యాప్ 0.10 శాతం పడిపోయాయి. రియాలిటీ ఇండెక్స్ 2.08 శాతం, పవర్ 1.1 శాతం, బ్యాంకెక్స్(Bankex) 1.04 శాతం క్షీణించగా.. టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు అర శాతం వరకు నష్టపోయాయి. డిఫెన్స్, పీఎస్యూ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు లభించింది. క్యాపిటల్ గూడ్స్(ప్రధానంగా డిఫెన్స్ స్టాక్స్) ఇండెక్స్1.67 శాతం పెరగ్గా.. పీఎస్యూ బ్యాంక్(PSU Bank) ఇండెక్స్ 1.5 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 1.29 శాతం లాభపడాడ్డాయి.
stock market | Top Gainers..
బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 30 ఇండెక్స్లో 25 కంపెనీలు నష్టాలతో ముగియగా 5 కంపెనీలు మాత్రమే లాభాలతో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank) అత్యధికంగా 3.16 శాతం నష్టపోయింది. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ రెండు శాతానికిపైగా పడిపోగా హెచ్డీఎఫ్సీ, రిలయన్స్(Reliance), బజాజ్ ఫిన్సర్వ్, అదాని పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, ఐటీసీ 1.5 శాతానికిపైగా పడిపోయాయి.
stock market | Top Losers..
టైటాన్(Titan) 4.38 శాతం పెరగ్గా.. టాటా మోటార్స్ 3.9 శాతం, ఎల్టీ 3.77 శాతం, ఎస్బీఐ 1.39 శాతం లాభపడ్డాయి.