అక్షరటుడే, వెబ్డెస్క్ : Brahmos | ఎట్టకేలకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ (Pak PM Shareef) నిజం ఒప్పుకున్నారు. భారత్ బ్రహ్మోస్(Brahmos Missile) దెబ్బ తగిలిందని అంగీకరించాడు. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది భారత పౌరులు మృతి చెందారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. పీవోకే, పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది. దీంతో దాదాపు వంద మంది ఉగ్రవాదులు చనిపోయారు.
Brahmos | పాక్ దాడిని తిప్పికొట్టిన భారత్
ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్తాన్(Pakistan) భారత్లోని మిలటరీ స్థావరాలు, ప్రార్థన మందిరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిసైల్స్తో దాడులకు పాల్పడింది. అయితే భారత రక్షణ వ్యవస్థ (Defence System) పాక్ డ్రోన్లు, క్షిపణులను మధ్యలోనే అడ్డుకుంది. పాక్ నిత్యం దాడులకు తెగబడుతుండటంతో భారత సైన్యం.. పాక్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బ్రహ్మోస్ క్షిపణులను (Brahmos Missiles) ప్రయోగించి దాయాది దేశం ఎయిర్బేస్లను (Pak Air Bases) ధ్వంసం చేసింది.
Brahmos | పాక్ మేకపోతు గాంభీర్యం
భారత్ దెబ్బతో పాక్ అతలాకుతలం అయింది. అయినా తామే విజయం సాధించామని ఇన్ని రోజులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. అయితే తాజాగా పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అజర్బైజాన్లో మాట్లాడుతూ.. భారత ఎయిర్స్ట్రైక్స్పై స్పందించారు. తాము దాడి చేయాలని ప్రణాళిక వేశామన్నారు. అంతలోగానే భారత్ బ్రహ్మోస్ను ప్రయోగించిందని ఆయన పేర్కొన్నారు. రావల్పిండి (Ravalpindi) లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారని పాక్ ప్రధాని ఆరోపించారు. అనేక ప్రావిన్సులపై క్షిపణి దాడులు చేశారన్నారు. దాడి విషయాన్ని ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (asim muneer) తనకు చెప్పారని షరీఫ్ తెలిపారు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.