అక్షరటుడే, వెబ్డెస్క్: Iran – Israel | ఇరాన్– ఇజ్రాయెల్(Iran – Israel) మధ్య యుద్ధం కొనసాగుతోంది. నిత్యం ఇరు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. దీంతో బాంబుల మోతతో ఆ దేశాల్లోని నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులు(Indians) ఆందోళన చెందుతున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం(Central Government) వారిని స్వదేశానికి తరలిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా అర్మేనియా(Armenia) నుంచి తొలి విమానం గురువారం ఉదయం భారత్కు చేరుకుంది. 110 మంది భారతీయులు ఢిల్లీ ఎయిర్పోర్ట్(Delhi Airport)కు చేరుకున్నారు.
ఇరాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్(Operation Rising Lion) పేరిట దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ సైతం టెల్అవీవ్పై బాంబులతో విరుచుకుపడింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. యుద్ధం మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ(Iran Supreme Leader Ayatollah Khamenei) ప్రకటించారు. దీంతో ఆ దేశాల్లో ఉన్న భారతీయుల రక్షణ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది.