అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Navy enters : భారత్ – పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత నావికాదళం సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పాక్ను కట్టడి చేయడానికి పశ్చిమ కమాండ్ చేరాలని భారత నేవీ ఫోర్స్ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పాకిస్తాన్పై ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్ కొనసాగుతోంది.
భారత్ ఎదురుదాడికి దిగడంతో పాకిస్తాన్లో భయాందోళనలు నెలకొన్నాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, బహవల్పూర్లలో సైరన్లు మోగించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాకిస్తానీయుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు చోట్ల భారత ఫోర్స్ డ్రోన్స్ ప్రయోగించింది.