అక్షరటుడే, వెబ్డెస్క్: Indian Army | భారత ఆర్మీ indian army కీలక ప్రకటన చేసింది.
ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతరం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు ceasefire అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారంతో ఒప్పందం గడవు ముగుస్తుందని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆర్మీ స్పష్టతనిచ్చింది. పాక్తో కాల్పుల విరమణకు గడువు లేదని తెలిపింది. ఆదివారం డీజీఎంవో చర్చలు లేవని పేర్కొంది. కాల్పుల విరమణ కొనసాగుతుందని వివరించింది. ఈ నెల 12న ఇరు దేశాల DGMOల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని పేర్కొంది.
Indian Army | సరిహద్దుల్లో అప్రమత్తం
పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ operation sindoor చేపట్టి పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించి కాల్పుల విరమణకు అంగీకరించారు. అయినప్పటికీ భారత సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. మరోవైపు పాక్ దుందుడుకు చర్యలకు పాల్పడితే తిప్పికొట్టడానికి భారత బలగాలు సన్నద్ధంగా ఉన్నాయి.