More
    Homeక్రీడలుIND vs SL | చెలరేగిన ప్రతికా, మంధాన.. భారత్ శుభారంభం!

    IND vs SL | చెలరేగిన ప్రతికా, మంధాన.. భారత్ శుభారంభం!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: శ్రీలంక పర్యటన(Srilanka tour)లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. ముక్కోణపు వన్డే సిరీస్‌(ODI Tri-Nation Series)లో భాగంగా ఆదివారం కొలంబో(Colombo) వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్.. 9 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. హసిని పెరెరా(30), కవిషా దిల్‌హరి(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

    భారత బౌలర్ల(Indian bowlers)లో స్నేహ్ రాణా(3/31) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, శ్రీ చరణి రెండేసి వికెట్లు పడగొట్టారు. తెలుగు తేజం అరుంధతి రెడ్డికి ఓ వికెట్ దక్కింది. అనంతరం భారత మహిళల జట్టు 29.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 149 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.

    READ ALSO  Anderson-Tendulkar Trophy | విజృంభించిన బెన్​ డకెట్​.. తొలి టెస్టులో టీమిండియా ఓటమి

    ప్రతికా రావల్ Prathimka raaval (62 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. స్మృతి మంధాన srmruthi mandhana (46 బంతుల్లో 6 ఫోర్లతో 43), హర్లీన్ డియోల్(71 బంతుల్లో 4 ఫోర్లతో 48 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మంగళవారం రెండో వన్డే‌లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ఈ ముక్కోణపు సిరీస్ జరగుతుంది. ఒక్కో జట్టు తమ ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడనున్నాయి.

    Latest articles

    Central Cabinet | ఉపాధికి ఊతం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఆర్ డీఐకి రూ.లక్ష కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Cabinet | ప్రైవేట్ రంగంలో తయారీ, ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) మంగళవారం కీలక...

    Pashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే...

    Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం...

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...

    More like this

    Central Cabinet | ఉపాధికి ఊతం.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఆర్ డీఐకి రూ.లక్ష కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Central Cabinet | ప్రైవేట్ రంగంలో తయారీ, ఉపాధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) మంగళవారం కీలక...

    Pashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే...

    Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం...