అక్షరటుడే, న్యూఢిల్లీ: Asian Volleyball Championship : జమ్మూ కశ్మీర్లోని పహల్ గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ Pakistan పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్ లో ఉన్న పాక్ పౌరులు, పర్యాటకులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. పాక్ సైతం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఆసియా వాలీబాల్ ఛాంపియన్షిప్(Asian Volleyball Championship) నుంచి వైదొలగుతున్నట్లు భారత్ ప్రకటించింది.
ఇస్లామాబాద్(Islamabad) లో జరగనున్న వాలీబాల్ టోర్నీ నుంచి తాము తప్పుకొంటున్నట్లు భారత వాలీబాల్ ఫెడరేషన్(Inidan Volleyball Federation) స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఆ దేశంలో జరిగే ఏ టోర్నీలో కూడా తాము పాల్గొనబోమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. దీనికితోడు అన్ని రకాల అంతర్జాతీయ క్రీడల నుంచి పాక్ ను నిషేధించాలని ప్రపంచ దేశాలను ఫెడరేషన్ కోరింది.