అక్షరటుడే, న్యూఢిల్లీ: India-Pakistan war | పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాక్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, 9 ఉగ్ర స్థావరాలను తుడిచి పెట్టేసింది. భారత్ వాయుసేన దాడితో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
భారత్ ప్రతిదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్.. ఏమి చేయాలో పాలుపోక జమ్మూ ఎయిర్పోర్టుపై డ్రోన్లతో దాడికి దిగింది. కానీ భారత్ వాయు రక్షణ వ్యవస్థలు, వాయు రక్షణ తుపాకులు చురుకుగా పనిచేశాయి. పాక్కు చెందిన అనేక డ్రోన్లను కూల్చివేశాయి. అమృత్సర్, జమ్మూ, జైసల్మేర్ పై దాడి చేయడానికి పాక్ చేసిన ప్రయత్నాలను భారత వైమానిక రక్షణ వ్యవస్థ భగ్నం చేసింది.
మరో వైపు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగింది. పాక్ను కట్టడి చేసేందుకు భారత నావికాదళం పశ్చిమ కమాండ్ చేరాలని భావిస్తోంది.
పాక్ డ్రోన్ల దాడిని తిప్పి కొట్టిన తర్వాత ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ అయ్యారు. మరోవైపు త్రివిధ దళాల అధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసరంగా సమావేశమయ్యారు.
కాగా, పాక్ డ్రోన్ల దాడి తర్వాత.. భారత్ కౌంటర్ అటాక్ ప్రారంభించింది. లాహోర్, ఇస్లామాబాద్, సియాల్కోట్, బహవల్పూర్లలో భారత్ ఆర్మీ వేగవంతమైన దాడులను చేపడుతోంది.
భారత్, ఇండియా దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇండియా పాకిస్తాన్ యుద్ధం మొదలైనట్లేనా.. అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.