అక్షరటుడే, వెబ్డెస్క్: Anderson-Tendulkar Trophy : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ (England) తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా team India ఓటమి చెందింది. భారత్ జట్టు Indian team నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి అవలీలగా ఛేదించింది.
ఓపెనర్ బెన్ డకెట్ Ben Duckett (149, 170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్) భారీ శతకంతో బంతిని ఓ ఆట ఆడుకున్నాడు. జాక్ క్రాలీ (65), జో రూట్ (53*; 84 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. బెన్ స్టోక్స్ (33, 51 బంతుల్లో 4 ఫోర్లు) కూడా బెటర్గానే రాణించాడు. చివరలో జేమీ స్మిత్ (44, 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడు ప్రదర్శించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 2, శార్దూల్ ఠాకూర్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.
రెండో ఇన్నింగ్స్ లో 21/0 ఓవర్నైట్ స్కోరుతో అయిదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు.. తొలి సెషన్లో ఒక్క వికెట్టు కూడా కోల్పోకుండా 96 పరుగులు చేసింది. రెండో సెషన్లో ఆతిథ్య జట్టు క్రికెటర్లు 152 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయారు.
జాక్ క్రాలీ Jack Crawley, తర్వాత వచ్చిన ఓలీ పోప్ (8)ని ప్రసిద్ధి కృష్ణ పెవిలియన్కు పంపించేశాడు. క్రాలీ, డకెట్ తొలి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యంతో ఆడారు. డకెట్ 121 బంతుల్లోనే శతకం చేశాడు. సెంచరీ తర్వాత జోరు పెంచాడు. కానీ, టీ విరామానికి ముందే డకెట్, హ్యారీ బ్రూక్ (0)ను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.
ఇక మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చిందనుకునే తరుణంలో స్టోక్స్, రూట్ నిలకడగా ఆడి ఇన్నింగ్ను వారి చేతుల్లోకి తీసుకున్నారు. జడేజా బౌలింగ్లో స్టోక్స్ వెనుదిరిగినా రూట్, జేమీ స్మిత్ జట్టును నిలబెట్టారు.