అక్షరటుడే, వెబ్డెస్క్:Ind-Pak | జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్పై అనేక ఆంక్షలు విధించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను వదిలేది లేదని కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రకటించింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు, పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది.
భారత్(India) 1971 తర్వాత తొలిసారి పాకిస్థాన్(Pakistan) భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేసింది. బంగ్లాదేశ్ విభజన సమయంలో భారత్, పాక్ రెండు పూర్తిస్థాయిలో యుద్ధం చేశాయి. ఆ సమయంలోనే భారత్ పాక్లోకి వెళ్లి దాడులు చేసింది. తర్వాత కార్గిల్ వార్(Kargil War) సమయంలో భారత్ బలగాలు పాక్ సైనికులను కార్గిల్ నుంచి తరిమికొట్టాయి. కానీ ఆ దేశంలోకి వెళల్లేదు. అనంతరం 2016లో సర్జికల్ స్ట్రైక్స్(Surgical Strikes), 2019లో బాలకోట్ ఎయిర్స్ట్రైక్(Balakot Airstrike) భారత్ జరిపింది. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే పై రెండు సందర్భాల్లో భారత్ దాడులు చేసింది. తాజాగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పీవోకేతో పాట పాక్లోకి చొచ్చుకెళ్లి మరి ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టింది.
Ind-Pak | కీలక నేతల హతం
ఆపరేషన్ సింధూర్(Operation Sundhoor)లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో కీలక ఉగ్రనేతల హతం అయినట్లు సమాచారం. మురిడ్కేలోని మర్కజ్ తయ్యబాపై ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఈ ఘటనలో లష్కరే తోయిబా నేత హఫీజ్ అబ్దుల్ మాలిక్, మరో ఉగ్ర నేత ముదాసిర్(Terrorist Leader Mudassir) మృతి చెందినట్లు సమాచారం.
Ind-Pak | విమానాశ్రయాల మూసివేత
ఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్(Pakistan) ప్రతీకార చర్యలకు దిగొచ్చని భారత్(India) భావిస్తోంది. ఈ క్రమంలో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. పాక్ దాడికి దిగితే తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ దేశంలోని 9 ఎయిర్పోర్ట్(Airports)లు మూసివేసింది. ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది.