అక్షరటుడే, వెబ్డెస్క్: Viral Video : ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లోని ఝాన్సీ(Jhansi)లో తరచుగా విద్యుత్తు కోతలు(power cuts) సంభవిస్తుండడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు ఎండలు, మరో వైపు కరెంటు కోతలతో అల్లాడుతున్నారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే ఓ కుటుంబం ఉక్కపోత(heatstroke)తో అల్లాడిపోయింది.
భానుడి వేడి తాళలేక ఆ కుటుంబ సభ్యులు(family members) ఒక ATM బూత్(ATM booth)కు తమ మకాం మార్చారు. రాత్రంతా అక్కడే నిద్రపోయారు. కాగా, ఆ కుటుంబం ఏటీఎం బూత్లో విశ్రాంతి తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో(social media) వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియో తాజాగా యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(former UP CM, Samajwadi Party chief Akhilesh Yadav) దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన సదరు వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యుత్తు శాఖపై మండిపడ్డారు.
‘ఎక్స్’లో బుధవారం వీడియోను పోస్టు చేసిన అఖిలేష్ యాదవ్.. విద్యుత్తు కోతలను తట్టుకోలేని పేద ప్రజలు ఏటీఎంలో ఆశ్రయం పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. యూపీ విద్యుత్తు శాఖ(UP Electricity Department.. ఇక్కడ ఎవరైనా ఉన్నారా.. అంటూ క్యాప్షన్లో రాసుకొచ్చారు.