అక్షరటుడే, నిజాంసాగర్:Wrestling competitions | నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన కుస్తీ పోటీలు (Wrestling competitions) ఆహుతులను ఆకట్టుకున్నాయి. శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జాతర (Sri Madvirat Potuluri Veerabrahmendraswamy Jatara)లో భాగంగా బుధవారం బోనాలు, రథోత్సవం నిర్వహించారు. కుస్తీ పోటీల్లో విజేతలకు రూ.3వేల నగదు బహుమతిని అందజేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మల్లయోధులు (Wrestlers) తరలివచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
