అక్షరటుడే, వెబ్డెస్క్:Covid Test | దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. ఈ క్రమంలో పీఎంవో కార్యాలయం(PMO Office) కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని కలిసే మంత్రులు తప్పనిసరిగా కరోనా ఆర్టీ పీసీఆర్ పరీక్ష(Corona RT PCR test) చేయించుకోవాలని ఆదేశించింది.
దేశంలో ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసులు 7,121కు చేరాయి. 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటివరకు కోవిడ్తో 74 మంది చనిపోయారు. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. కేరళలో 2,223 కరోనా యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం. ఏపీలో 72, తెలంగాణలో 11 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.