అక్షరటుడే, న్యూఢిల్లీ: Alert for smokers : బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ తాగితే ఇకపై రూ.1000 జరిమానా కట్టాల్సిందే. ఈ మేరకు ఝార్ఖండ్ ప్రభుత్వం(Jharkhand government) నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై రూపొందించిన ఝార్ఖండ్ సవరణ బిల్లు 2021(Jharkhand Amendment Bill 2021)కు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము(President Draupadi Murmu) ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాజ్ భవన్ సెక్రటేరియట్ ప్రకటించింది.
Alert for smokers : నాలుగేళ్ల క్రితమే ఆమోదం
ఈ సవరణ బిల్లును ఆమోదం తెలపడానికి ముందు ఝార్ఖండ్లోని బహిరంగ ప్రదేశంలో సిగరెట్లు తాగితే రూ. 200 జరిమానా విధించే నిబంధన ఉండేది. ప్రస్తుతం ఇది ఐదు రెట్లు పెరిగి రూ. వెయ్యికి చేరుకుంది. ఈ సవరణను బిల్లును హేమంత్ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితమే అసెంబ్లీలో ఆమోదించింది.
ఈ సవరణ బిల్లును అసెంబ్లీ(Assembly)లో ప్రవేశపెట్టే సమయంలో అప్పటి ఎజేఎస్యూ ఎమ్మెల్యే లంబోదర్ మహతో (AJSU MLA Lambodar Mahato) కీలక ప్రతిపాదన చేశారు. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగితే జరిమానా మొత్తాన్ని రూ.వెయ్యి నుంచి రూ.10,000కి పెంచాలని డిమాండ్ చేశారు.
21 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి సిగరెట్, పొగాకు అమ్మడం నేరమని మహతో గుర్తుచేశారు. కాగా, ఝార్ఖండ్ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడానికి ఓ నెల ముందే రాష్ట్రంలో హుక్కా బార్లను నిషేధించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష లేదా రూ. లక్ష వరకు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.