అక్షరటుడే, వెబ్డెస్క్:Jagadish Reddy | బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీని నడపడం రాని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె పరోక్షంగా కేటీఆర్(KTR)పై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Former Minister Jagadish Reddy) స్పందించారు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఆ పార్టీతో పొత్తు కూడా ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR)ను ప్రశ్నిస్తే నష్టపోతారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
కవిత వ్యాఖ్యలతో గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే పార్టీలోని నేతలు రెండుగా విడిపోయారు. కొందరు కవితకు మద్దతు తెలుపుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో మంచి ఉత్సాహంగా ఉన్న బీఆర్ఎస్(BRS)పై కవిత తన వ్యాఖ్యాలతో నీళ్లు చల్లారు. మరోవైపు రాష్ట్రంలో కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో జగదీశ్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ అధినాయకుడు, తెలంగాణ(Telangana)కు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
Jagadish Reddy | చంద్రబాబుకు కౌంటర్
ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh)లోని కడపలో జరిగిన టీడీపీ మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) మాట్లాడుతూ.. హైదరాబాద్ను తాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. బాబు మాటలకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ అభివృద్ధి(Hyderabad Development)కి తానే కారణం అని చెప్పుకున్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయని, అలానే మోస పూరితంగా ఉంటాయని ఆరోపించారు. ఏపీని 2014 నుంచి 2019 వరకు పాలించిన చంద్రబాబు ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణ తలసరి ఆదాయం పెరిగితే, ఏపీది పెరగలేదన్నారు. మరి తన ఐదేళ్ల పాలనలో బాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.