అక్షరటుడే, వెబ్డెస్క్:BRS | కష్టపడి సాధించుకున్న తెలంగాణ(Telangana)ను కేసీఆర్ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి (MLA Vemula Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan) అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిజామాబాద్ నగరంలోని అమరవీరుల స్థూపం వద్ద వారు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్(KCR) తెలంగాణ సాధించారన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు, మహిళలు, సబ్బండ వర్ణాలు అన్ని ఒక్క దిక్కు నిలిచి తెలంగాణ కోసం నాడు కేసీఆర్ వెంట నడిచాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించుకొని 11 ఏళ్లు అవుతోందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని జనరంజక పాలన అందించారని చెప్పారు. ఆయన రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారన్నారు. రేవంత్రెడ్డి(cm Revanth Reddy) పాలనలో రాష్ట్రం తిరోగమనంలో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే రాష్ట్ర తలసరి ఆదాయంలో 4వ స్థానానికి ,GSDPలో 13వ స్థానానికి పడిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Congress government) ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.