అక్షరటుడే, వెబ్డెస్క్: Balochistan Liberation Army : భారత్ – పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సోమవారం చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. భారత్కు మద్దతు ప్రకటించిన బలూచ్.. పాక్పై దాడి చేయాలని కోరింది.
పశ్చిమ సరిహద్దు నుంచి మద్దతు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బలూచ్ పేర్కొంది. పాక్పై భారత్ నిర్ణయాత్మక చర్యకు దిగితే.. భారత్కు తాము సైనిక శక్తిగా నిలుస్తామని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా గుర్తించాలంటూ బలూచ్ కోరింది.
పాక్ సైన్యంతో యుద్ధం చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA).. భారత్ సహాయం కోరుతూ ఆదివారం లేఖ రాసింది. పాకిస్తాన్ పై భారత్ దాడి చేయాలని కోరింది. భారత్ ఒక్క అడుగు ముందుకేస్తే.. పశ్చిమ సరిహద్దు నుంచి దానిని నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ Balochistan Liberation Army ఏ దేశానికీ కీలుబొమ్మ కాదని స్పష్టం చేసింది. ప్రాంతీయ సైనిక.. రాజకీయ సమీకరణాలలో నిర్ణయాత్మక పార్టీగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎదిగిందని పేర్కొంది.
పాక్ శాంతి, కాల్పుల విరమణ ప్రకటనలను మోసంగా BLA అభివర్ణించింది. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మక చర్యగా లేఖలో పేర్కొంది. పాక్ మాటలకు బలైపోవద్దని కోరింది. పాకిస్తాన్ నిఘా సంస్థ Pakistan’s intelligence agency ISI ప్రపంచ ఉగ్రవాదాని global terrorism కి కేంద్రంగా పనిచేస్తుందని BLA అభివర్ణించింది.
ప్రపంచం ఈ విషయాన్ని గుర్తించకపోతే, బలూచ్ ప్రజలు తమ పోరాటాన్ని స్వయంగా కొనసాగిస్తారని BLA ప్రకటించింది. స్వతంత్ర బలూచిస్తాన్ మాత్రమే ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అంతం చేసి.. శాశ్వత శాంతి, సమతుల్యత స్థాపించగలదని BLA చెప్పింది.
Balochistan Liberation Army : పాక్ సైన్యాన్ని ఓడించాం..
బయటి నుంచి ఎలాంటి మద్దతు లేకుండా, బలూచ్ గడ్డపై పాక్ లాంటి అణ్వాయుధ శక్తిని అనేక రంగాల్లో ఓడించామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది. పాకిస్తాన్ను దాని మూలాల నుంచి నిర్మూలించడానికి భారత్ తమకు రాజకీయ, దౌత్య, సైనిక మద్దతు ఇవ్వాలని కోరింది. పాక్ ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం, అస్థిరత ఉంటాయని బీఎల్ఏ స్పష్టం చేసింది.